Header Banner

న్యూజిలాండ్ లో కరోనా విజృంభణ.. 50 శాతానికి పైగా! భారత్‌లోనూ స్వల్పంగా..

  Fri Jun 06, 2025 21:14        Australia

న్యూజిలాండ్‌లో ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారితో పాటు ఇతర శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఈ వ్యాధుల వ్యాప్తి ఆందోళనకరంగా మారింది. జాతీయ వైద్య సలహా సేవా సంస్థ 'హెల్త్‌లైన్'కు ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్న వారి నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ సంఖ్య పెరిగిందని రేడియో న్యూజిలాండ్ (ఆర్ఎన్ జడ్) నేడు వెల్లడించింది. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈ కాల్స్ సంఖ్య కొంత తక్కువగానే ఉందని పేర్కొంది. దేశంలో ఈ ఏడాది అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే తక్కువకు పడిపోగా, దక్షిణ ద్వీపంలోని కొన్ని ప్రాంతాలు మంచుతో కప్పుకుపోయాయి. దేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ఆక్లాండ్ ప్రాంతంలో, జూన్ 1తో ముగిసిన వారంలో తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య 50 శాతానికి పైగా పెరిగింది. అయినప్పటికీ, మొత్తంమీద ఈ సంఖ్య గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే సమానంగానే ఉందని తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి: G7 సదస్సుకు మోదీకి ఆహ్వానం.. భారత్ తో పాటు!

 

దేశవ్యాప్తంగా మురుగునీటి పరీక్షల ద్వారా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో హెల్త్ న్యూజిలాండ్ స్పందించిందని, సిబ్బందిని పెంచడం, ఆసుపత్రుల్లో పడకల వినియోగాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దడం, టీకా కార్యక్రమాలను ముమ్మరం చేయడం వంటి చర్యలు చేపట్టినట్లు ఆర్ఎన్జెడ్ నివేదికను ఉటంకిస్తూ జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఈ ఏడాది 10 లక్షల మందికి పైగా ఫ్లూ షాట్లు తీసుకున్నప్పటికీ, కేవలం 2,50,000 మంది మాత్రమే కోవిడ్-19 బూస్టర్ డోసులు తీసుకున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్లపై ప్రజల్లో ఉన్న అపనమ్మకాలు, ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యల కారణంగా టీకా కార్యక్రమాలను వేగవంతం చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయని నేషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ హెలెన్ స్టోక్స్-లాంపార్డ్ అంగీకరించినట్లు ఆర్ఎన్జెడ్ నివేదిక పేర్కొంది. ఇదిలా ఉండగా, భారత్‌లో కూడా కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు నమోదవుతున్నాయి. జూన్ 6 ఉదయం 8 గంటల సమయానికి దేశవ్యాప్తంగా 5,862 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో నాలుగు కొత్త మరణాలు నమోదయ్యాయి, అంతకు ముందు రోజు ఏడు మరణాలు సంభవించాయి.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

 

ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

 

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NewZealand #Covid-19 #Respiratory #Infections #Flu #Hospitals #AucklandVaccination #HelenStokesLampard #India #Coronavirus